దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడీ నడుస్తోంది. గెలుపుకై ఎవరి వ్యూహాలతో వారు ముందుకు పోతున్నారు. కాని కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల వేళ మరో జలక్ తగిలింది. ఆదాయపన్ను శాఖ ఆ పార్టీకి 1700 కోట్ల డిమాండ్ నోటీసు ఇచ్చినట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉన్నది. 2017-18 నుంచి 2020-21 మధ్య కాలానికి చెందిన డిమాండ్ నోటీసు అని తెలుస్తోంది. ఆ నోటీసులో పెనాల్టీతో పాటు వడ్డీ కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. మరో వైపు ఆదాయపన్ను శాఖ అసెస్మెంట్ను పునర్ పరిశీలించాలని కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.