Friday, September 27, 2024
HomeUncategorizedటిక్కెట్ ఇవ్వలేదని పురుగులమందు తాగిన ఈరోడ్‌ ఎంపీ

టిక్కెట్ ఇవ్వలేదని పురుగులమందు తాగిన ఈరోడ్‌ ఎంపీ

Date:

లోక్‌సభ ఎన్నికల వేళ మళ్లీ పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వలేదని మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎండీఎంకే పార్టీకి చెందిన ఈరోడ్‌ ఎంపీ గణేశమూర్తి గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంపీ టికెట్ దక్కకపోవడంతో గణేశమూర్తి మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కొయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు.

ఎండీఎంకే పార్టీలో కీలక నేత అయిన గణేశమూర్తి.. 2019 పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోడ్ నుండి భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందారు. ఈ సారి ఎండీఎంకే పార్టీ ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎంపీ.. మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆయన్న కుటుంబ సభ్యులు వెంటనే కోవైలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారని.. అక్కడ పరీక్షించిన వైద్యులు అతడిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినట్లు వివరించారు. అనంతరం మెరుగైన వైద్య కోసం కోయంబత్తూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.