Friday, September 27, 2024
HomeUncategorizedచనిపోయిన కూతురి సమాధి పక్కనే పడుకున్న తండ్రి

చనిపోయిన కూతురి సమాధి పక్కనే పడుకున్న తండ్రి

Date:

కన్నకూతుర్లు అంటే తండ్రికి ఎనలేని ప్రేమ ఉంటుంది. ఒక్క నిమిషం కూతురు కనపడకపోయే సరికి తట్టుకోలేక పోతారు. అలాంటిది అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు చనిపోయేసరికి ఆ తండ్రి తట్టుకోలేక పోతున్నాడు. కూతురిపై ప్రేమతో ఆ తండ్రి చేసిన పని అందరిని కన్నీరు పెట్టిస్తుంది. చనిపోయిన తన కూతురిని మర్చిపోలేక కూతురు సమాది పక్కనే పడుకున్నాడు. ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నారాయణపేట రూరల్ – గోపాల్ పేట వీధికి చెందిన లక్ష్మీ ప్రణీత హోలీ వేడుకల సందర్భంగా ఆడుకుంటుండగా.. ఒక్కసారిగా మినీ వాటర్ ట్యాంక్ కూలిపోయి ఆమెపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ప్రణీత తీవ్రగాయాలతో మృతి చెందగా.. అదే రోజు సాయంత్రం పట్టణ శివారులోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నప్పటి నుంచి కూతురును అల్లారు ముద్దుగా పెంచుకున్న తండ్రి.. ఆమెను అసలు మర్చిపోలేక పోయాడు.

దహన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తండ్రి రమేష్ స్నానం చేసిన వెంటనే బయటకు వెళ్లాడు. రాత్రి 11.30 గంటలు దాటిన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి అమ్మాయిని పూడ్చిన స్థలానికి వెళ్లి చూడగా అక్కడే పడుకొని ఉన్నాడు. ఇది చూసిన అక్కడి వారు కూతురిపై తండ్రికి ఉన్న ప్రేమకు ఒక్కసారిగా కన్నీరు పెట్టారు. అనంతరం తండ్రి రమేష్ ను సముదాయించి ఇంటికి తీసుకొచ్చారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. కూతురిపై తండ్రికి ఉన్న ప్రేమకు తరించి పోతున్నారు.కూతురిపై ప్రేమతో ఓ తండ్రి చేసిన పని అందరిని కన్నీరు పెట్టిస్తుంది. చనిపోయిన తన కూతురిని మర్చిపోలేని తండ్రి కూతురు సమాధి పక్కనే పడుకున్నాడు.