Friday, September 27, 2024
Homeక్రైంబీజాపూర్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్

బీజాపూర్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్

Date:

ఛత్తీస్‌​గఢ్ రాష్ట్రం బీజాపుర్​ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ​ఈ ఎన్‌​కౌంటర్‌​లో ఇద్దరు మహిళతో సహా ఆరుగురు నక్సల్స్(మావోయిస్టులు) మరణించారు. బీజాపూర్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. చికుర్​బత్తి – పుస్బాక సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పుల ఘటన జరిగింది. డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కోబ్రా దళానికి చెందిన సిబ్బంది కలిసి యాంటీ నక్సల్​ ఆపరేషన్‌ను చేపట్టాయి. ఈ క్రమంలోనే భద్రతా సిబ్బందిపై నక్సల్స్ కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు బస్తర్​ రేంజ్ ఐజీ సుందర్ ​రాజ్​ తెలిపారు.

కాల్పుల ఆగిన తర్వాత ఘటనా స్థలం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలకు కూడా తీసున్నాం. కాల్పుల్లో పలువురు నక్సలైట్లు గాయపడ్డారు. ఇంకా బీజాపుర్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఐజీ సుందర్ రాజ్​ వెల్లడించారు. బీజాపుర్‌ జిల్లా బస్తర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ స్థానానికి ఏప్రిల్‌ 19న తొలి విడతలోనే పోలింగ్‌ జరగనుంది. ఈ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలింగ్‌ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు యాంటీ-నక్సల్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు.