దేశంలో లోక్సభ తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. తొలి విడత నామినేషన్ల దాఖలుకు బుధవారం ఆఖరిరోజు కావడంతో మంగళవారం పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు నియోజకవర్గానికి చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి వినూత్న వేషధారణలో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. నూర్ మహ్మద్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థి మెడలో మిరపకాయల దండలు, క్యాప్సికం దండలు వేసుకుని డప్పు కొడుతూ తన అనుచరులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.